గోవర్ధన్ రెడ్డికి సీఎం రేవంత్ నివాళి

గోవర్ధన్ రెడ్డికి సీఎం రేవంత్ నివాళి

కోస్గి, వెలుగు : కాంగ్రెస్​ సీనియర్​ నేత, నారాయణపేట జిల్లా కోస్గి మున్సిపల్​కౌన్సిలర్​చింతల గోవర్ధన్ రెడ్డి(48) భౌతికకాయానికి సీఎం రేవంత్ రెడ్డి నివాళి అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు  సానుభూతి తెలియజేశారు. ప్రభుత్వం తరఫున అన్నివిధాలా  ఆదుకుంటామని హామీ ఇచ్చారు. నారాయణపేట జిల్లా పోతిరెడ్డిపల్లికి చెందిన గోవర్ధన్ రెడ్డి గురువారం అర్ధరాత్రి తన ఇంట్లో  గుండెపోటుతో చనిపోయారు.

విషయం తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం మధ్యాహ్నం 1:30 గంటలకు హెలికాప్టర్ ద్వారా కోస్గి పట్టణానికి చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో  పోతిరెడ్డిపల్లికి చేరుకొని గోవర్ధన్ భౌతికకాయానికి నివాళి  అర్పించారు. సీఎం వెంట మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.