రాష్ట్ర అభివృద్ధికి నిధులు ఇవ్వండి..జైకాను కోరిన సీఎం రేవంత్ రెడ్డి

రాష్ట్ర అభివృద్ధికి నిధులు ఇవ్వండి..జైకాను కోరిన సీఎం రేవంత్ రెడ్డి
  • మూసీ, ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టులకు రుణాలివ్వాలని విజ్ఞప్తి 
  • మెట్రో సెకండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రూ. 11,693 కోట్లు ఇవ్వాలని ప్రపోజల్ 
  • కేంద్రాన్ని సంప్రదించాలని సూచించిన జైకా  

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి పనులకు ఆర్థికంగా సహకారం అందించాలని జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ( జైకా)ని ప్రభుత్వం కోరింది. జపాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధుల బృందం గురువారం జైకా మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సమావేశమైంది. ఇందులో సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, జైకా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ షోహెయ్ హరా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెట్రో రైలు రెండో దశ, మూసీ పునరుజ్జీవం, ట్రిపుల్ ఆర్ నుంచి ఓఆర్ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అనుసంధానించే రేడియల్ రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆర్థిక సాయం అందించాలని  కోరారు. పెట్టుబడిదారులను ఆకర్షించేలా ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు, ప్రపంచ పెట్టుబడుల గమ్యస్థానంగా హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తీర్చిదిద్దేందుకు చేపట్టిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల గురించి వివరించారు.

కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో రూ. 24,269 కోట్ల అంచనాతో చేపట్టనున్న మెట్రో సెకండ్ ఫేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన ప్రతిపాదనలు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ తుది పరిశీలనలో ఉన్నాయని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు అవసరమమ్యే వ్యయంలో 48 శాతం.. అంటే రూ.11,693 కోట్లు లోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఇవ్వాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ విదేశీ రుణ నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం కచ్చితంగా పాటిస్తుందని చెప్పారు. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను న్యూయార్క్, టోక్యో నగరాలతో సమానంగా అభివృద్ధి చేస్తామన్నారు. 

కేంద్రాన్ని సంప్రదించండి: జైకా 

తెలంగాణతో జైకాకు ఎన్నో ఏండ్లుగా సంబంధాలు ఉన్నాయని జైకా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ షోహెయ్ హరా అన్నారు. మెట్రో రైలుతో పాటు ఇతర ప్రాజెక్టులకు జైకా నుంచి ఆర్థిక సాయం పొందేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని సూచించారు. ఈ సమావేశంలో స్పెషల్​సీఎస్​జయేశ్ రంజన్, సీఎం ముఖ్య కార్యదర్శి వి.శేషాద్రి, మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.