తెలంగాణలో ఎలాంటి ఉపఎన్నికలు రావు.. ఎమ్మెల్యేలు టెన్షన్ పడొద్దు: సీఎం రేవంత్

తెలంగాణలో ఎలాంటి ఉపఎన్నికలు రావు.. ఎమ్మెల్యేలు టెన్షన్ పడొద్దు: సీఎం రేవంత్

 తెలంగాణలో పార్టీ ఫిరాయింపులపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఎలాంటి ఉప ఎన్నికలు రాబోవని..సభ్యులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు సీఎం రేవంత్. 

మార్చి 26న అసెంబ్లీలో మాట్లాడిన రేవంత్..పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ నేతలు గగ్గోలు పెడుతున్నారు. ప్రతిరోజు ఉప ఎన్నికలు వస్తాయని ప్రచారం చెబుతున్నారు. 2014 నుంచి 2024 వరకు రాష్ట్రంలో  ఎలాంటి సంప్రదాయం ఉందో అదే సంప్రదాయాన్ని మేం ఫాలో అవుతున్నాం. . పార్టీ మారిన ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ మంత్రి పదవులు ఇచ్చింది. మేం ఎలాంటి పదవులు ఇవ్వడం లేదు. వాళ్ల అడుగుజాడల్లో మేం నడవడం లేదు. ప్రతి రోజు ఉప ఎన్నికలు వస్తాయని ప్రచారం చేస్తున్నారు. ఫిరాయింపుల అంశం కోర్టు పరిధిలో ఉంది. తెలంగాణలో ఎలాంటి ఉప ఎన్నికలు రావు.. ఎమ్మెల్యేలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.మా దృష్టి ఉప ఎన్నికలపై లేదు..అభివృద్దిపైనే ఉంది. అని రేవంత్ అన్నారు.

ALSO READ | నడి బజారులో న్యాయవాదులను నరికి చంపితే ఇప్పటికీ శిక్షలు పడలే: బీఆర్ఎస్‎పై CM రేవంత్ ఫైర్

జమిలీ ఎన్నికలపైన కూడా  సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయన్నారు. జమిలీ ఎన్నికలు వస్తే  అసెంబ్లీ టర్మ్ మరో ఆరు నెలలు పొడిగించే అవకాశం ఉందన్నారు.