
ఆర్మూర్, వెలుగు : ఆర్మూర్ నియోజకవర్గానికి ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పథకం ద్వారా రూ.3.48 కోట్లు నిధులను సీఎం రేవంత్ రెడ్డి మంజూరు చేశారని ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ప్రొద్దుటూరి వినయ్ రెడ్డి వెల్లడించారు. సోమవారం హైదరాబాద్ లో సీఎం రేవంత్రెడ్డిని కలిసి నిధులు మంజూరు చేయాలని కోరినట్లు తెలిపారు. నిధులు మంజూరు చేసిన సీఎంకు ధన్యవాదాలు తెలిపారు.