
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో 1,061 అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి మార్గదర్శకాలు విడుదల చేశామని సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. గడిచిన 15 ఏండ్లలో ఈ ప్రక్రియ జరగకపోవడం ఆశ్చర్యాన్ని, విస్మయాన్ని కలిగించిందని ఆయన పేర్కొన్నారు. పేదబిడ్డల విద్యపై గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం క్షమించరాని నేరమని మండిపడ్డారు. ప్రతి వ్యవస్థలో జరిగిన ఇలాంటి తప్పిదాలను గుర్తిస్తూ, సరిచేస్తున్నామని, ప్రజా ప్రభుత్వం రాష్ట్ర పునర్నిర్మాణం దిశగా అడుగులు వేస్తోందన్నారు.