గుజరాత్ కు సీఎం రేవంత్‌.. రెండురోజుల పాటు ఏఐసీసీ కీలక సమావేశాలు

గుజరాత్ కు సీఎం రేవంత్‌.. రెండురోజుల పాటు ఏఐసీసీ కీలక సమావేశాలు
  • అహ్మదాబాద్ లో రెండురోజుల పాటు ఏఐసీసీ కీలక సమావేశాలు
  • రేపు హాజరుకానున్న ముఖ్యమంత్రి
  • ఇవాళ సాయంత్రమే బయలుదేరనున్న డిప్యూటీ సీఎం, మంత్రులు 

హైదరాబాద్:  సీఎం రేవంత్​రెడ్డి గుజరాత్​లో పర్యటించనున్నారు. అహ్మదాబాద్ లో రేపు, ఎల్లుండి ఏఐసీసీ కీలక సమావేశాలు జరగనున్నాయి.  ఈమీటింగ్​లో పాల్గొనేందుకు రేపు ఆయన అహ్మదాబాద్​కు వెళ్లనున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, పలువురు కీలక నేతలు ఇవాళ సాయంత్రమే బయలుదేరనున్నారు. 

రాష్ట్ర కాంగ్రెస్ నుంచి మొత్తం 44 మంది నేతలకు ఆహ్వానం అందింది. జాతీయస్థాయిలో పార్టీ అనుసరించాల్సిన విధానాలు, వ్యూహాలపై చర్చిస్తారని సమాచారం. ఈ సమావేశాల్లోనే  కులగణన సర్వే, బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణపై సీఎం రేవంత్​వివరించనున్నారు.