
- రూ.629.62 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
- శివునిపల్లి వద్ద బహిరంగ సభ
జనగామ/ స్టేషన్ ఘన్పూర్, వెలుగు : ఈ నెల 16న సీఎం రేవంత్రెడ్డి స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ కేంద్రానికి రానున్నారు. ఇటీవల ప్రభుత్వం మంజూరు చేసినరూ.629.62 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. ఘన్పూర్ శివారులోని శివునిపల్లి వద్ద బహిరంగ సభ నిర్వహించనుండడంతో స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
రూ.629.62 కోట్లతో పనులు ప్రారంభం..
స్టేషన్ఘన్పూర్ లో పలు అభివృద్ధి పనులకు గానూ రాష్ర్ట ప్రభుత్వం 629.62 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఇందులో భాంగానే జఫర్ఘడ్ మండలం కోనాయిచలంలో రూ.200 కోట్లతో యంగ్ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్కూల్కాంప్లెక్స్ను నిర్మించనున్నారు. నియోజకవర్గ కేంద్రంలో రూ.5.5 కోట్లతో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్, రూ.కోటితో టీజీ ఎన్పీడీసీఎల్ డివిజనల్ ఆఫీస్, కుర్చపల్లి, సాగరం, కొండాపూర్లలో 33/11 కేవీ సబ్స్టేషన్లు, రూ.10 కోట్లతో వేలేరు మండలం పీచరలో 220/132 కేవీ సబ్ స్టేషన్, రూ.2 కోట్లతో బంజారా భవన్, ఎస్డీఎఫ్, ఈజీఎస్కింద రోడ్ల నిర్మాణానికి రూ.25 కోట్లు మంజూరయ్యాయి.
స్టేషన్ ఘన్పూర్లో రూ.45.50 కోట్లతో 100 పడకల ఆస్పత్రి భవనం, రూ.26 కోట్లతో ఇంటిగ్రేటెడ్డివిజనల్ఆఫీస్కాంప్లెక్స్, రూ.148.76 కోట్లతో ఘన్పూర్ నుంచి నవాబుపేట రిజర్వాయర్వరకు మెయిన్ కెనాల్ సీసీ లైనింగ్నిర్మాణ పనులు చేపట్టనున్నారు. పంచాయతీ రాజ్శాఖ ఆధ్యర్యంలో సీసీ రోడ్ల కోసం రూ.53 కోట్లు, నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు సాంక్షన్ కాగా, స్టేషన్ ఘన్పూర్కు మరో 1500ల ఇండ్లు, ఆయిల్సీడ్ కలెక్షన్ సెంటర్ మంజూరు కాగా శంకుస్థాపన చేయనున్నారు.
అదేవిధంగా జనగామ జిల్లాలోని మహిళా సంఘాలకు 7 మహిళా శక్తి ఆర్టీసీ బస్సులు మంజూరు కాగా, వాటిని సభ్యురాళ్లకు సీఎం ఇక్కడి నుంచే అందించనున్నారు. సీఎం పర్యటన నేపత్యంలో శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆధ్వర్యంలో కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్, అడిషనల్ కలెక్టర్లు రోహిత్సింగ్, పింకేష్కుమార్, డీసీపీ రాజమహేంద్ర నాయక్, ఇతర ప్రభుత్వ డిపార్ట్మెంట్ల ఆఫీసర్లతో కలిసి ఏర్పాట్లు పరిశీలించారు.