
- పెండింగ్ బిల్లులు, స్థానిక
- ఎన్నికలపై చర్చించే అవకాశం
హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి బుధవారం పంచా యతీ రాజ్శాఖపై రివ్యూ చేపట్టను న్నారు. ఆ శాఖలో పెండింగ్ బిల్లులు, ఉద్యోగులు, సిబ్బంది పెండింగ్ జీతాలు, అభివృద్ధి కార్యక్రమాలతోపాటు స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించే అవకా శం ఉన్నట్టు అధికారవర్గాలు చెప్తున్నాయి. ఈ క్రమంలో మంగ ళవారం సెక్రటేరియెట్లో పీఆర్, ఆర్డీ కార్యదర్శి లోకేశ్కుమార్ ఆ శాఖ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పీఆర్లో అభివృద్ధి పనులు, పెండింగ్ బిల్లుల కు సంబంధించి రిపోర్ట్ రెడీ చేయాలని ఆదేశించారు. సీఎం రివ్యూకు పూర్తి సమాచారంతో హాజరుకావాలని సూచించారు.