సీఎం టూర్‌‌ను సక్సెస్ చేయాలి : ఎమ్మెల్యే కడియం శ్రీహరి

సీఎం టూర్‌‌ను సక్సెస్ చేయాలి : ఎమ్మెల్యే కడియం శ్రీహరి

స్టేషన్​ఘన్‌పూర్, వెలుగు:  ఈ నెల 16న సీఎం రేవంత్​రెడ్డి జనగామ జిల్లా స్టేషన్​ఘన్​పూర్‌‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా స్టేషన్​ఘన్​పూర్​పట్టణం శివునిపల్లి శివారు పాలకుర్తి రోడ్డులోని  సీఎం సభాస్థలాన్ని బుధవారం ఎమ్మెల్యే కడియం శ్రీహరి సందర్శించారు. ఆయన వెంట కలెక్టర్​ రిజ్వాన్​బాషాషేక్, అడిషనల్​కలెక్టర్లు రోహిత్​సింగ్, పింకేష్​కుమార్, డీసీపీ రాజమహేంద్ర నాయక్​ ఉన్నారు. 

 ప్రధాన సభావేదిక, హెలిప్యాడ్​, శంకుస్థాపనకు సంబంధించి శిలాఫలకాలు ఏర్పాటు, ముఖ్యమైన పనులపై ఆఫీసర్లకు సూచనలు చేశారు.  సీఎం సభకు 50  వేల మందికి పైగా రానున్నారని పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు.  ఆర్డీవో వెంకన్న, సీఐ వేణు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.