కేరళకు సీఎం రేవంత్ రెడ్డి..

కేరళకు  సీఎం రేవంత్ రెడ్డి..

హైదరాబాద్: ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి అక్టోబర్ 22న రాత్రి కేరళ బయల్దేరారు. అక్టోబర్ 23న వయనాడ్ లో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ నామినేషన్ దాఖలు కార్యక్రమానికి హాజరవుతారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ వయనాడ్, అమేథీ నుంచి ఎంపీగా ఎన్నికైన విషయం తెలిసిందే. 

నిబంధనల  ప్రకారం ఒక సెగ్మెంట్లో రాజీనామా చేయాలి. దీంతో ఆయన వయనాడ్ లో ఎంపీ  పదవికి రాజీనామా చేశారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. అక్కడి నుంచి రాహుల్ సోదరి ప్రియాంకగాంధీ బరిలోకి దిగుతున్నారు. ఆమె అక్టోబర్ 23న నామినేషన్ దాఖలు చేయనుండటంతో సీఎం రేవంత్ వయనాడ్ వెళ్తున్నారు.

ALSO READ | వయనాడ్ బై పోల్: కూతురి కోసం నేరుగా రంగంలోకి సోనియా గాంధీ