ఎమ్మెల్యే వివేక్ కోరినట్టు.. ఎస్సీ రిజర్వేషన్లు 15 శాతం నుంచి 18 శాతానికి పెంచుతాం: సీఎం రేవంత్

ఎమ్మెల్యే వివేక్ కోరినట్టు.. ఎస్సీ రిజర్వేషన్లు 15 శాతం నుంచి 18 శాతానికి పెంచుతాం: సీఎం రేవంత్

చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ కోరినట్టు దామాషా ప్రకారం ఎస్సీ రిజర్వేషన్లుపెంచుతామన్నారు సీఎం రేవంత్. 2026 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ రిజర్వేషన్లు పెంచుతామని చెప్పారు.రిజర్వేషన్లు పెంచడం,న్యాయపరంగా పంచడం తమ బాధ్యత అని రేవంత్ అన్నారు. ఎస్సీ బిల్లుపై చర్చ సందర్బంగా రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారు.

 అంతకుముందు ఎస్సీ బిల్లుపై చర్చ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే వివేక్ ఏమన్నారంటే.. బడ్జెట్ లో ఎస్సీలకు 18 శాతం కేటాయించాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే వివేక్.  ఇందిరాగాంధీ ఎస్సీలకు ఎంతో చేశారని చెప్పారు ఎమ్మెల్యే వివేక్ .. అసైన్డ్ భూములను ఎస్సీలకు పంపిణీ  చేశారని తెలిపారు.   కులగణన ప్రకారం ఎస్సీలకు 18 శాతం రిజర్వేషన్లు వస్తాయన్నారు.  ఎస్సీల్లో విభజన తెచ్చే ప్రమాదం ఉందని ఆనాడే అంబేద్కర్ చెప్పారన్నారు ఎమ్మెల్యే వివేక్.  హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో ఎస్సీలకు రిజర్వేషన్లు పెరిగాయన్నారు. ఎస్సీ పారిశ్రామిక వేత్తలకు రూ.100 కోట్ల కార్పస్ ఫండ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.  కాంట్రాక్టుల  కేటాయింపుల్లో ఎస్సీలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.  నామినేటెడ్ పోస్టుల్లోనూ 18 శాతం ఇవ్వాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే వివేక్.  

ALSO READ | ఎస్సీ వర్గీకరణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం

వర్గీకరణ టైంలో మాలలపై తప్పుడు ప్రచారం చేశారన్నారు . ప్రభుత్వ పథకాల లబ్ధిదారులపై ఫేక్ ప్రచారం చేశారని విమర్శించారు. ఉద్యోగాలు, స్కీంలు మాలలకే వచ్చినట్లు ఫేక్ ప్రచారం చేశారని తెలిపారు. మాదిగలకు 65 వేలకు పైగా జాబ్ లు వస్తే..మాలలకు 48 వేల జాబ్స్ వచ్చాయన్నారు వివేక్. ఎస్సీ కార్పొరేషన్ నిధుల్లో మాదిగలకే ఎక్కువ వాటా ఇచ్చారన్నారు వివేక్.