కేసీఆర్​ సభకు వచ్చింది రెండు సార్లే.. రూ. 57 లక్షలు జీతం తీసుకున్నరు

కేసీఆర్​ సభకు వచ్చింది రెండు సార్లే.. రూ. 57 లక్షలు జీతం తీసుకున్నరు

ప్రతిపక్ష నేత కేసీఆర్​  రెండుసార్లే సభకు వచ్చి రూ. 57 లక్షల జీతం తీసుకున్నారని సీఎంరేవంత్​రెడ్డి అసెంబ్లీలో తెలిపారు. ప్రభుత్వం నుంచి జీతం తీసుకొని ప్రజల సమస్యలను గాలికి వదిలిన .. కేసీఆర్​ తెలంగాణ హక్కులను  తాకట్టు పెట్టారన్నారు. రాజ్యాంగ స్ఫూర్తితో ఏర్పడిన వ్యవస్థలను నిర్వీర్యం చేసిన కేసీఆర్​... హయాంలో గవర్నర్​ ప్రసంగం లేకుండానే బడ్జెట్​ సమావేశాలు జరిగాయన్నారు.

గతంలో బలహీన వర్గాలకు చెందిన ఓ మహిళా గవర్నర్​ ను అవమాన పరిచే విధంగా కేసీఆర్​ ప్రవర్తించాన్న సీఎం రేవంత్​ రెడ్డి ప్రజాస్వామ్యం,ప్రభుత్వాలు ఏ ఒక్కరి  వ్యక్తుల సొంతం కాదన్నారు.

Also Read : కేసీఆర్ సభకు వచ్చినప్పుడే.. కృష్ణా జలాలపై చర్చిద్దాం

నాగార్జునసాగర్​ ప్రాజెక్ట్​ పైకి ఏపీ పోలీసులు వస్తే కేసీఆర్​ ఏంచేశారని ప్రశ్నించారు.  తెలంగాణ రైతాంగానికి మరణ శాసనం రాసింది బీఆర్​ఎస్​ కాదా అని ప్రశ్నించారు.  పదేళ్లు పాలించిన బీఆర్​ఎస్​నేతలు ఇలానే మాట్లాడేది అన్నారు. గవర్నర్ ప్రసంగం కాంగ్రెస్ విధానాలకు  ఎలా ఉంటుంది.. మంత్రివర్గం ఆమోదించిన స్పీచ్ ను గవర్నర్ చదువుతారని అసెంబ్లీలో సీఎం కేసీఆర్​ అన్నారు,