హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్​... జపాన్​ పర్యటనలో పలు కంపెనీలతో కీలక ఒప్పందాలు

హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్​... జపాన్​ పర్యటనలో పలు కంపెనీలతో కీలక ఒప్పందాలు

జపాన్​ పర్యటన ముగించుకొని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి హైదరాబాద్​ చేరుకున్నారు.  శంషాబాద్​ విమానాశ్రయంలో సీఎం రేవంత్​ కు  ఎంపీలు.. ఎమ్మెల్యేలు.. సలహాదారులు.. కార్పొరేషన్​ చైర్మన్​ లు.. ఇతర కాంగ్రెస్​ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.  ఏప్రిల్​ 16 న  సీఎం నేతృత్వంలో అధికారులు బృందం ప జపాన్​ పర్యటనకు వెళ్లింది.  ఏడు రోజుల పాటు జపాన్​ లో పర్యటించిన అధికారుల వివిధ పరిశ్రమల యాజమాన్యాలతో సంప్రదింపులు జరిపి తెలంగాణలో  రూ. 12వేల 62 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. 

కీలక ఒప్పంద వివరాలు:

 

  • హైదరాబాద్​ ఫ్యూచర్​ సిటీలో నెక్స్ట్​ జనరేషన్​ ఇండస్ట్రియల్​ పార్క్​ ఏర్పాటు చేసేందుకు మారుబెని కంపెనీతో అగ్రిమెంట్​ చేసుకున్నారు.  ఈ ఒప్పందంలో మొత్తం అంచనా పెట్టుబడి రూ. 5 వేల కోట్లుకాగా.. తొలుత వెయ్యి కోట్లతో ప్రారంభపెట్టుబడి పెట్టేందుకు ఒప్పందం చేసుకున్నారు. ఈ ప్రాజెక్ట్​ ద్వారా తెలంగాణ యువతకు 30 వేల ఉద్యోగాలు రానున్నాయి. 
  • జపాన్​లో 500 ఉద్యోగ నియామకాలకు టామ్​ కామ్​... టెర్న్​.. రాజ్​ గ్రూప్​ సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది.  ఈ ఒప్పందం ప్రకారం.. తెలంగాణ యువతకు ఉద్యోగాలు ఇచ్చేందుకు ఆ సంస్థ అంగీకారం తెలిపింది. 
  • రుద్రారంలో రూ. 562 కోట్లతో  ఎలక్ట్రికల్​ పరికరాలు తయారీ ఫ్యాక్టరీని నెలకొల్పేందుకు తోషిబా ట్రాన్స్ మిషన్ & డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ఇండియా (TTDI) తో  జపాన్​ పర్యటనలో సీఎం రేవంత్​రెడ్డి బృందం ఒప్పందం చేసుకుంది. 
  • రూ. 10 వేల 500 కోట్ల పెట్టుబడితో హైదరాబాద్​ లో ఇంటెలిజెన్స్​ డేటా సెంటర్​ క్లస్టర్​ ఏర్పాటు చేసేందుకు NTT డేటా, నెయిసా కంపెనీలతో అంగీకారం కుదుర్చుకుంది.