మార్చి 16న స్టేషన్​ ఘన్​పూర్​కు సీఎం రేవంత్

మార్చి 16న స్టేషన్​ ఘన్​పూర్​కు సీఎం రేవంత్
  • 100 బెడ్స్​ హాస్పిటల్​ సహా 
  • పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన
  • శివునిపల్లి శివారులో నిర్వహించే భారీ బహిరంగ సభకు హాజరు
  • ఏర్పాట్లు పూర్తి చేసిన ఆఫీసర్లు

జనగామ, వెలుగు: జనగామ జిల్లా స్టేషన్​ ఘన్​పూర్​లో ఆదివారం సీఎం రేవంత్​ రెడ్డి పర్యటించనున్నారు. శివునిపల్లి వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. రూ. 800 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. జఫర్​ఘడ్​ మండలం కోనాయిచలం వద్ద రూ రూ.200 కోట్లతో నిర్మించనున్న యంగ్​ ఇండియా ఇంటిగ్రేటెడ్​ రెసిడెన్షియల్​ స్కూల్​ కాంప్లెక్స్, ఘన్​పూర్​లో రూ.45.50 కోట్లతో నిర్మించనున్న 100 పడకల హాస్పిటల్​ బిల్డింగ్, రూ.26 కోట్లతో డివిజనల్​ ఆఫీస్​​కాంప్లెక్స్​ నిర్మాణంతో పాటు అభివృద్ధి​పనులకు సభా వేదిక వద్ద నుంచే శంకుస్థాపన చేయనున్నారు. 

ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. సభ ఏర్పాట్లను శనివారం ఎమ్మెల్యే కడియం శ్రీహరి, కలెక్టర్​ రిజ్వాన్​ బాషా షేక్​ పరిశీలించి పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. స్వయం సహాయక సంఘాల స్టాల్స్​ను సందర్శిస్తారు. అక్కడే స్వయం సహాయక సంఘాలకు ఏడు మహిళా శక్తి బస్సులను అందిస్తారు. ఆ తరువాత బహిరంగ సభలో పాల్గొని ప్రజా పాలనపై మాట్లాడనున్నారు.