
నందిపేట, వెలుగు: మండలంలోని సీహెచ్.కొండూర్, ఆంధ్రానగర్ గ్రామాలకు చెందిన బాధిత కుటుంబాలకు గురువారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మంద మహిపాల్ సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు.
కొండూర్ కు చెందిన బొండ్ల సుజాత అనారోగ్యం బారిన పడడంతో వైద్యం సాయం కోసం దరఖాస్తు చేసుకోగా రూ.32వేలు, ఆంధ్రానగర్ గ్రామానికి చెందిన సత్తెనపల్లి సుమతికి రూ.60 వేలు మంజూరయ్యాయి. సీఎంఆర్ఎఫ్ మంజూరుకు కృషి చేసిన నియోజకవర్గ ఇన్చార్జి వినయ్రెడ్డి కి బాధిత కుటుంబీకులు కృతజ్ఞతలు తెలిపారు.