
- కొత్తగూడెంలో కోల్ఇండియా అథ్లెటిక్స్థాయి పోటీలు షురూ
- తొలి రోజు నాలుగు మెడల్స్సాధించిన సింగరేణి
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: సింగరేణిలో క్రీడలకు పెద్దపీట వేస్తున్నామని డైరెక్టర్ఈఅండ్ఎం డి. సత్యనారాయణ పేర్కొన్నారు. పని ఒత్తిడితో ఉండే కార్మికులు, అధికారులకు క్రీడాపోటీలు కొత్త ఉత్సాహాన్నిస్తాయన్నారు. కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో శనివారం కోల్ ఇండియా స్థాయి అథ్లెటిక్ క్రీడాపోటీలను ఆయన ప్రారంభించి క్రీడాజ్యోతిని వెలిగించారు.
క్రీడాకారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కోలిండియా స్థాయి అథ్లెటిక్ పోటీల బాధ్యత సీఐఎల్ సింగరేణికి ఇవ్వడం హర్షణీయమన్నారు. సింగరేణితో పాటు దేశంలోని తొమ్మిది బొగ్గు గని సంస్థల నుంచి క్రీడాకారులు పాల్గొంటున్నారని తెలిపారు. క్రీడాకారులకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించామన్నారు.
సింగరేణి క్రీడాకారులు అత్యధిక పతకాలు సాధించి సంస్థకు పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ ప్రోగ్రాంలో జీఎం పర్సనల్కవితానాయుడు, గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల నేతలు మిర్యాల రంగయ్య, త్యాగరాజన్, డీజీఎంలు అజయ కుమార్, రాజేంద్రప్రసాద్, శివ కేశవులు, ఆఫీసర్లు వరప్రసాద్, రాజ్గోపాల్, సుశీల్ కుమార్, స్పోర్ట్స్ సూపర్ వైజర్లు పోస్నెట్, జాన్ వెస్లీ, నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.