- 2500 ఆపరేషన్లతో దేశంలోనే నంబర్ వన్ గా నిలిచిన ఆస్పత్రి
హైదరాబాద్, వెలుగు : వినికిడి సమస్యతో బాధపడేవారికి కాక్లియర్ఇంప్లాంట్సర్జరీలు చేసి హైదరాబాద్ అపోలో రికార్డ్ సృష్టించింది. అత్యధికంగా 2,500 సర్జరీలు చేసి దేశంలో నెంబర్ వన్ హాస్పిటల్నిలిచిందని డాక్టర్ఈసీ వినయ్కుమార్తెలిపారు. 9 నెలల చిన్నారి నుంచి 87 ఏండ్ల వృద్ధుల వరకు సర్జరీలు చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపామని పేర్కొన్నారు. శుక్రవారం జూబ్లీహిల్స్లోని అపోలో హాస్పిటల్లో ఆయన మీడియాకు వివరాలు వెల్లడించారు.
1994లో అపోలో హాస్పిటల్లో కాక్లియర్ ఇంప్లాంట్ ప్రోగ్రామ్ ప్రారంభించామన్నారు. 2007లో సీఎం వైఎస్ ఆర్ కు రిప్రజంటేషన్ఇస్తే, రెండు వారాల్లోనే ఆరోగ్యశ్రీలో చేర్చారని గుర్తుచేశారు. ఒకేరోజు18 సర్జరీలు చేసి లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లోనూ సృష్టించామని పేర్కొన్నారు. కాక్లియర్ఇంప్లాంట్ సర్జరీలు చేసిన పిల్లల్లో 95శాతం నార్మల్ స్కూళ్లలోనే చదువుతున్నారన్నారు. డాక్టర్స్ టీమ్ను అపోలో జాయింట్మేనేజింగ్డైరెక్టర్ సంగీతా అభినందించారు. డాక్టర్జస్విందర్సింగ్, రవీందర్బాబు, ఈఎన్టీ టీమ్, సర్జరీలు చేయించుకున్నవారు పాల్గొన్నారు.