మొయినాబాద్​లో కోడి పందేలు..64 మంది అరెస్ట్​

మొయినాబాద్​లో కోడి పందేలు..64 మంది అరెస్ట్​
  •     మొయినాబాద్ తోలుకట్టలో  64 మంది అరెస్ట్
  •     84 పందెం కోళ్లు, రూ.30 లక్షల క్యాష్, 50 కార్లు స్వాధీనం

హైదరాబాద్ సిటీ/చేవెళ్ల, వెలుగు: సిటీ శివారులో కోడి పందేల గుట్టురట్టయింది. మంగళవారం రాత్రి రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం తోలుకట్ట గ్రామ పరిధిలోని వ్యవసాయ భూమిలో భారీ ఎత్తున కోడి పందేలు నిర్వహిస్తున్నట్లు ఎస్ఓటీ పోలీసులకు సమాచారం అందింది. 

రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్, చేవెళ్ల ఏసీపీ ఐ.కిషన్, మొయినాబాద్ సీఐ పవన్ కుమారెడ్డి 50 మంది సిబ్బందితో కలిసి పందేల శిబిరంపై దాడి చేశారు. ఏపీకి చెందిన నిర్వాహకుడు శివకుమార్, పందెం రాయుళ్లను చుట్టుముట్టి మొత్తం 64 మందిని అదుపులోకి తీసుకున్నారు. 84 పందెం కోళ్లు, రూ.30 లక్షల క్యాష్, 50 కార్లను స్వాధీనం చేసుకున్నారు. 64 మందిని మొయినాబాద్ పీఎస్​కు తరలించారు. తెలంగాణ, ఏపీకి చెందిన వ్యక్తులు పెద్ద ఎత్తున కోడి పందేలు ప్లాన్​చేసినట్లు తెలిసింది.