
- ప్రశ్నించిన కస్టమర్ల మీదనే రెస్టారెంట్ నిర్వాహకులు గరం
ట్యాంక్ బండ్, వెలుగు: నెక్లెస్ రోడ్డులోని రైల్ కోచ్ రెస్టారెంట్ బిర్యానీలో బొద్దింక వచ్చింది. అది చూసిన కస్టమర్కంగుతిన్నాడు. విజయ్ అనే వ్యక్తి తన ఫ్రెండ్స్తో కలిసి సోమవారం మధ్యాహ్నం నెక్లెస్ రోడ్డులోని రైలు కోచ్ రెస్టారెంట్కు వెళ్లాడు. అందరికీ బిర్యానీ ఆర్డర్ చేశాడు. సగం తిన్న తర్వాత బిర్యానీలో బొద్దింక కనిపించింది. నిర్వాహకులను పిలిచి ఇదేమిటని ప్రశ్నించగా, అతనిపైనే సీరియస్అయ్యారు.
దీంతో చేసేదేమీ లేక ఫ్రెండ్స్తో కలిసి ఫుడ్ సేఫ్టీ అధికారులను సంప్రదించాడు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇలాంటి హోటల్స్ పై చర్యలు తీసుకోవాలని, ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు.