క్యూటీక్యూ హోటల్ చికెన్​ బిర్యానీలో బొద్దింక .. హోటల్​ సీజ్.. జరిమానా

క్యూటీక్యూ హోటల్ చికెన్​ బిర్యానీలో బొద్దింక .. హోటల్​ సీజ్.. జరిమానా

జనగామ, వెలుగు: జిల్లా కేంద్రంలోని హైదరాబాద్​ రోడ్డులో గల క్యూటీక్యూ హోటల్ లో వడ్డించిన చికెన్​బిర్యానీలో బొద్దింక వచ్చిన ఘటన గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రఘునాథపల్లికి చెందిన వ్యక్తి బిర్యానీ ఆర్డర్ చేయగా వెయిటర్​ వడ్డించాడు. 

తింటుండగా బొద్దింక కనిపించడంతో అతను హోటల్​నిర్వాహకులను ప్రశ్నించగా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. దీంతో బాధితుడు  అధికారులకు సమాచారం ఇచ్చాడు. ఫుడ్​ ఇన్​స్పెక్టర్​ కృష్ణమూర్తి, మున్సిపల్​శానిటరీ ఇన్​స్పెక్టర్​శేఖర్, ఎస్ఐ రాజేశ్​ కుమార్​హోటల్ కు చేరుకొని, విచారణ చేపట్టారు. హోటల్​ను సీజ్​ చేసి, నిర్వాహకులకు రూ.10 వేల జరిమానా విధించినట్లు శానిటరీ ఇన్​స్పెక్టర్​చెప్పారు.