
- .పీఎం విశ్వకర్మ పథకంపై కలెక్టర్ రివ్యూ
వనపర్తి, వెలుగు: జిల్లాలోని అన్ని మండలాలు, మున్సిపాలిటీల పరిధిలో పెండింగ్ లో ఉన్న పీఎం విశ్వకర్మ పథకానికి సంబంధించిన దరఖాస్తులను వెంటనే క్లియర్ చేయాలని కలెక్టర్ ఆదర్శ సురభి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో వివిధ కులవృత్తులకు సంబంధించి పీఎం విశ్వకర్మ కింద ఎంపికై శిక్షణ తీసుకున్న లబ్ధిదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వారికి సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పీఎం విశ్వకర్మ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ప్రతి దివ్యాంగుడికి ఒక ప్రత్యేక గుర్తింపు కార్డు ఉండాలని ప్రభుత్వం యూడీఐడీ( యూనిక్ డిజేబుల్ ఐడీ)ని అమల్లోకి తీసుకొచ్చిందని తెలిపారు. భవిష్యత్లో యూడీఐడీ పోర్టల్ ద్వారానే దివ్యాంగులకు ధ్రువపత్రాలు జారీ చేస్తారన్నారు. అడిషనల్ కలెక్టర్ యాదయ్య, ఎంఎస్ఎంఈ ఏడీ శివరాం ప్రసాద్, ఇండస్ట్రీస్ జీఎం జ్యోతి, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ ఇందిర, డీఆర్డీవో ఉమాదేవి, ఎల్డీఎం కౌశల్ కిశోర్ పాండే పాల్గొన్నారు.