ఎల్ఆర్ఎస్​రాయితీపై అవగాహన కల్పించాలి : కలెక్టర్​ అద్వైత్ కుమార్ సింగ్

ఎల్ఆర్ఎస్​రాయితీపై అవగాహన కల్పించాలి : కలెక్టర్​ అద్వైత్ కుమార్  సింగ్

మహబూబాబాద్/ జనగామ/ వరంగల్​సిటీ/ ములుగు, వెలుగు:  ఎల్​ఆర్​ఎస్​ రాయితీపై ప్రజలకు అవగాహన కల్పించాలని మహబూబాబాద్​ కలెక్టర్​ అద్వైత్ కుమార్  సింగ్​అన్నారు. బుధవారం కలెక్టరేట్​లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ నెల 31లోగా అప్లై చేసుకుంటే 25 శాతం రాయితీ అవకాశాన్ని పొందవచ్చన్నారు. జనగామలో కలెక్టర్​ రిజ్వాన్​ బాషా షేక్​ మాట్లాడుతూ ఎల్​ఆర్​ఎస్​పై గురువారం మున్సిపల్​ ఆఫీస్​లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనుమానాల నివృత్తికి కలెక్టరేట్​లో హెల్ప్​లైన్​ సెంటర్​ను ఏర్పాటు చేశామని 9948187334, మున్సిపల్​ ఆఫీస్​లో 8978207205 కు కాల్ చేయాలని సూచించారు.​ 

వరంగల్​ బల్దియా కార్యాలయంలో కమిషనర్​ అశ్విని తానాజీ వాఖాడే ఎల్​ఆర్​ఎస్​ దరఖాస్తుల పురోగతిపై సమీక్షించారు. దరఖాస్తుల పరిశీలన వేగవంతం కావాలని సూచించారు. బల్దియా ప్రధాన కార్యాలయం, కాశీబుగ్గ ఖాజీపేట సర్కిల్ కార్యాలయాల్లో హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేయాలని సీపీని ఆదేశించారు. ములుగు కలెక్టరేట్​లో అడిషనల్​ కలెక్టర్​ సీహెచ్​ మహేందర్​జీ నిర్వహించిన సమీక్షలో మాట్లడుతూ ప్రభుత్వ నిబంధనల  ప్రకారం ఎల్ ఆర్ ఎస్ దరఖాస్తులను పరిష్కరించడానికి చర్యలు చేపట్టాలని సూచించారు.