
- అధికారులపై సిద్దిపేట కలెక్టర్ ఆగ్రహం
- హుస్నాబాద్మోడల్స్కూల్ సందర్శన
హుస్నాబాద్, వెలుగు : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని మోడల్ స్కూల్లో స్టూడెంట్స్కు కారంపొడితో అన్నం పెడుతుంటే ఏం చేస్తున్నారని స్కూల్ప్రిన్సిపాల్, ఎంఈవో, డీఈవోపై కలెక్టర్ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్నిరోజులుగా స్కూల్లో స్టూడెంట్స్కు మిడ్డే మీల్స్కారంపొడితో పెడుతున్నట్టు కలెక్టర్ దృష్టికి వచ్చింది. దీంతో ఆయన గురువారం ఈ స్కూల్కు వచ్చి విద్యార్థులతో మాట్లాడి విషయాన్ని తెలుసుకున్నారు.
తమకు అన్నంలో కూరలు పెట్టకుండా కారంపొడి వేస్తున్నారని విద్యార్థులు కలెక్టర్దృష్టికి తెచ్చారు. దీంతో అధికారులపై కలెక్టర్ సీరియస్ అయ్యారు. మెనూ ప్రకారం భోజనం పెట్టని వంట ఏజెన్సీపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని డీఈవో శ్రీనివాస్రెడ్డి, ఎంఈవో దేశిరెడ్డి, ప్రిన్సిపాల్ అన్నపూర్ణను ప్రశ్నించారు. ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా అని అసహనం వ్యక్తం చేశారు. పద్ధతి వెంటనే మార్చుకోవాలని సూచించారు.
ఆఫీసులకు స్థలాన్ని చూడాలి
హుస్నాబాద్లో మెడికల్కాలేజీ, ఆర్టీఏ ఆఫీసు ఏర్పాటు కోసం స్థలాన్ని చూడాలని రెవెన్యూ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. గురువారం తహసీల్దార్ రవీందర్రెడ్డితో మాట్లాడి అనువైన స్థలాల గురించి తెలుసుకున్నారు. హుస్నాబాద్ చుట్టుపక్కల అనువుగా ఎక్కడుందో పరిశీలించి నివేదిక ఇవ్వాలని అధికారులకు సూచించారు.