అక్టోబర్ 21నుంచి గ్రూప్-1 మెయిన్స్..

అక్టోబర్ 21నుంచి గ్రూప్-1 మెయిన్స్..
  • 8 సెంటర్లలో గ్రూప్-1 మెయిన్స్
  • ఈ నెల 21 నుంచి 27 వరకు పరీక్షలు  
  • హాజరుకానున్న 5,613 మంది అభ్యర్థులు

హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ జిల్లాలోని 8 సెంటర్లలో గ్రూప్-1 మెయిన్స్ ఎగ్జామ్స్​నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ఈ నెల 21 నుంచి 27 వరకు ఎగ్జామ్స్(కన్వెన్షనల్ /డిస్క్రిప్టివ్ టైప్) జరుగుతాయని, 5,613 మంది అభ్యర్థుల హాజరుకానున్నారని వెల్లడించారు. 

మధ్యాహ్నం 2 గంటల నుంచి  సాయంత్రం 5 వరకు ఎగ్జామ్స్​జరుగుతాయని తెలిపారు. అభ్యర్థులను మధ్యాహ్నం 12:30 గంటల నుంచి సెంటర్​లోకి అనుమతిస్తామని, ఎగ్జామ్​కు అరగంట ముందే గేట్లు మూసివేస్తామని స్పష్టం చేశారు. 

డౌన్‌‌‌‌లోడ్ చేసిన హాల్ టికెట్‌‌‌‌లో ఫొటో స్పష్టంగా లేకుంటే, అభ్యర్థి మూడు ఫొటోలతో గెజిటెడ్​ఆఫీసర్​సంతకం చేయించాలని, www.tspsc.gov వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లో అందుబాటులో ఉన్న ఫార్మాట్‌‌‌‌ ప్రకారం హాల్​టికెట్ ఉండాలని చెప్పారు.