కామారెడ్డి జిల్లాలో మహిళా సంఘాలకు 156 వడ్ల కొనుగోలు సెంటర్లు : కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్

కామారెడ్డి  జిల్లాలో మహిళా సంఘాలకు 156 వడ్ల కొనుగోలు సెంటర్లు : కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్

కామారెడ్డి టౌన్, వెలుగు : ప్రభుత్వ ఆదేశాలతో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే వడ్ల కొనుగోలు సెంటర్లను పెంచుతామని కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్ పేర్కొన్నారు. గురువారం సెర్ఫ్​  లక్ష్యాలపై పంచాయతీ రాజ్​ శాఖ సెక్రటరీ లోకేశ్​కుమార్ వీసీ ద్వారా ఆయా జిల్లాల కలెక్టర్లతో మాట్లాడారు. మహిళ సంఘాల ద్వారా వడ్ల కొనుగోలు సెంటర్ల ఏర్పాటు, పెట్రోల్​ బంక్స్ ఏర్పాటు, ఫించన్లు తదితర అంశాలను వివరించారు. అనంతరం కలెక్టర్ అధికారులతో మాట్లాడారు. 

జిల్లాలో ఇది వరకు వడ్ల కొనుగోలు సెంటర్లు 27 ఉన్నాయని వీటిని 156కు పెంచనున్నామన్నారు.    సెంటర్లకు కావాల్సిన ఎక్విప్​మెంట్స్ సమకూర్చాలని అధికారులకు సూచించారు.  పెట్రోల్​ బంక్​ల ఏర్పాటుకు  సత్వరమే చర్యలు చేపట్టాలన్నారు. స్టూడెంట్స్​ యూనిఫాం కుట్టే ఏర్పాట్లు చేయాలన్నారు.  సదరం క్యాంపుల నిర్వహణకు ఏర్పాట్లు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ విక్టర్, డీఆర్డీవో సురేందర్, ఎల్​డీఎం రవికాంత్, డీసీవో రాంమోహన్, సివిల్ సప్లయ్ మేనేజర్ రాజేందర్,  డీఎస్​వో మల్లికార్జునబాబు,  మెప్మా పీడీ శ్రీధర్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు.