లింగంపేట ఆదర్శ గ్రామం కావాలి : కలెక్టర్​ ఆశిశ్​సాంగ్వాన్

లింగంపేట ఆదర్శ గ్రామం కావాలి : కలెక్టర్​ ఆశిశ్​సాంగ్వాన్

లింగంపేట, వెలుగు : చారిత్రక నేపథ్యం ఉన్న లింగంపేట ఆదర్శ గ్రామం కావాలని, అందుకు తనవంతు కృషి చేస్తానని కలెక్టర్ ఆశిశ్​సంగ్వాన్​అన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా శుక్రవారం లింగంపేటలోని నాగన్న మెట్లబావి వద్ద నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. చారిత్రక కట్టడాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. నాగన్నబావిని పర్యాటక కేంద్రంగా ప్రకటించామని,  ఇకపై పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని చెప్పారు. పర్యాటకుల కోసం​హోటళ్లు,రెస్టారెంట్లు, ప్రూట్ స్టాళ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ​

లింగంపేటలోని గాలికి ఊగే ధ్వజస్థంభం, రామాలయాలను అభివృద్ధి చేస్తామన్నారు. రాబోయే రోజుల్లో నాగన్నబావి లింగంపేటకు చిహ్నంగా మారుతుందని చెప్పారు. నాగన్నబావి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. పండగలు, పర్వదినాల్లో బావివద్ద  ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలన్నారు.  బావి సందర్శనకు రూ.10, ఫొటోషూట్,​ వీడియోగ్రఫీకి రూ.500 చెల్లించేలా చర్యలు తీసుకున్నామన్నారు.  

అనంతరం డ్వాక్రా సంఘాల మహిళలు తయారు చేసిన పిండివంటలను రుచి చూశారు. కార్యక్రమంలో జడ్పీ సీఈఓ చందర్, డీఆర్​డీఓ సురేందర్, ఆర్డీఓ ప్రభాకర్, ఎంపీడీఓ నరేశ్, తహసీల్దార్​నరేందర్​గౌడ్ ఏపీఎం శ్రీనివాస్,​ ఎంఈఓ షౌకత్ పాల్గొన్నారు. 

కామారెడ్డి టౌన్, వెలుగు :  జిల్లాలోని ప్రభుత్వ స్కూల్స్, హాస్టల్స్​లో అత్యవసర పనులకు వెంటనే ప్రతిపాదనలు తయారు చేయాలని కామారెడ్డి కలెక్టర్​ ఆశిశ్​సంగ్వాన్​ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్​లో  ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, విద్యాశాఖ, ఇంజనీరింగ్​శాఖల ఆఫీసర్లతో రివ్యూ మీటింగ్​ నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆయన​ మాట్లాడుతూ.. హాస్టల్స్​లో అత్యవసర పనులకు ప్రతిపాదనలు పంపాలన్నారు.   తాగునీటి సమస్య తలెత్తితే వెంటనే పరిష్కరించాలన్నారు. జడ్పీ సీఈవో చందర్, ఆఫీసర్లు దయానంద్​, రజిత,  తదతరులు పాల్గొన్నారు.

జిల్లా స్థాయి యువజనోత్సవాలు

కామారెడ్డి జిల్లా స్థాయి యువజనోత్సవాలు శుక్రవారం కళాభారతిలో నిర్వహించారు.  కలెక్టర్​ మాట్లాడుతూ.. యువత అన్ని రంగాల్లో ముందుండాలన్నారు.  విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.  అడిషనల్ కలెక్టర్​ శ్రీనివాస్​రెడ్డి, ఆర్డీవో రంగనాథ్​రావు తదితరులు పాల్గొన్నారు.