ఎమ్మెల్సీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి : కలెక్టర్ ఆశిశ్ సంగ్వాన్

ఎమ్మెల్సీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి : కలెక్టర్ ఆశిశ్ సంగ్వాన్

కామారెడ్డిటౌన్,  వెలుగు: ఈ నెల 27న జరిగే ఉమ్మడి కరీంనగర్,  ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఆశిశ్​ సంగ్వాన్​అన్నారు.  శనివారం  కలెక్టరేట్‌లో పీవో, ఏపీవో, ఓపీవోలకు ఫస్ట్​ విడత ట్రైనింగ్​నిర్వహించారు. 

 కలెక్టర్​ మాట్లాడుతూ..  ఎలక్షన్ నిర్వహణ కోసం నియమితులైన అధికారులు, సిబ్బంది బాధ్యతాయుతంగా పని చేయాలన్నారు.  27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4  గంటల వరకు  పోలింగ్​నిర్వహించాలన్నారు.    సీపీవో రాజరాం, ఆర్డీవో ప్రభాకర్​, డీఆర్​డీవో సురేందర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దయానంద్, పాల్గొన్నారు. ట్రైనింగ్ గురించి మాస్టర్​ట్రైనర్స్​ రామకృష్ణ, లక్ష్మణ్‌ వివరించారు. ​