ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి : కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​

ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి :  కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​

కామారెడ్డి టౌన్, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని కామారెడ్డి కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​ సూచించారు. సోమవారం కలెక్టరేట్​లో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రిటర్నింగ్​ అధికారులు ( స్టేజీ-1) అధికారులకు ట్రైనింగ్ ​నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ పొరపాటు, లోపాలకు తావులేకుండా ఎన్నికల విధుల్ని నిర్వహించాలన్నారు. నామినేషన్ల స్వీకరణ టైంలో  జాగ్రత్తగా వ్యవహరించాలని సమస్యలు, అనుమానాలు ఉంటే ఉన్నతాధికారులను సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్​విక్టర్, డీపీవో శ్రీనివాస్​రావు తదితరులు పాల్గొన్నారు.

రెడీగా ఉండాలి..

స్థానిక  సంస్థల ఎన్నికల నిర్వహణకు యంత్రాంగం రెడీగా ఉండాలని కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​ అధికారులకు సూచించారు. ఎన్నికల నిర్వహణపై కలెక్లరేట్ లో ఆయా శాఖల అధికారులతో నిర్వహించిన మీటింగ్​లో ఆయన మాట్లాడారు. పోలింగ్​కేంద్రాల్లో ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా బ్యాలట్​బాక్సులు సిద్ధంగా ఉంచాలన్నారు.  మండలస్థాయిలో ఈనెల 14, 15 తేదీల్లో ప్రిసైడింగ్​అధికారులు, పోలింగ్​ అధికారుల నియమాకం కోసం ఫస్ట్ ర్యాండమైజేషన్​ ప్రక్రియ కంప్లీట్​చేయాలన్నారు. ఎన్నికల మెటీరియల్​ రెడీ చేసుకోవాలన్నారు. అనంతరం పోలికల్​పార్టీల ప్రతినిధులతో కలెక్టర్​ సమావేశమయ్యారు.