ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి మార్కవుట్​ ఇవ్వాలి

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి మార్కవుట్​ ఇవ్వాలి

కామారెడ్డి టౌన్, వెలుగు : లబ్ధిదారుల జాబితాలోని వారు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకునేందుకు రెడీగా ఉన్న వారికి వెంటనే మార్కవుట్ ఇవ్వాలని కలెక్టర్ ఆశిష్​ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్​లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై ఆయా శాఖల అధికారులతో రివ్యూ చేశారు.  ఇందిరమ్మ ఇండ్లు బెస్మిట్ వరకు నిర్మాణాలు త్వరగా జరిగేలా చూడాలన్నారు. 

 నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు యాప్​లో ఎంట్రీ చేయాలన్నారు. గతంలో నిర్మించిన డబుల్​ బెడ్ రూమ్​ ఇండ్ల వద్ద మౌలిక వసతులు కల్పించాలన్నారు. హౌసింగ్​ పీడీ విజయ్​పాల్​రెడ్డి,   జడ్పీ సీఈవో చందర్,  డీఆర్​డీవో సురేందర్,  ఎన్పీడీసీఎల్ ఎస్ఈ శ్రవణ్​ తదితరులు పాల్గొన్నారు.

ఎస్సెస్సీ సెంటర్​ తనిఖీ ..

కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లిలోని జడ్పీ హైస్కూల్​లో  ఎస్సెస్సీ ఎగ్జామ్​ సెంటర్​ను బుధవారం కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కాపీయింగ్​కు పాల్పడకుండా పటిష్ట నిఘా ఉండాలని అధికారులకు సూచించారు.