
కామారెడ్డి, వెలుగు : పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికైన లింగంపేట మండలంలో భూ భారతి పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు.
భూ సమస్యలపై రెవెన్యూ సదస్సుల్లో దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులు సంయుక్తంగా సర్వే చేయనున్నట్లు తెలిపారు. సమీక్షలో డీఎఫ్వో నిఖిత, జిల్లా అడిషనల్ కలెక్టర్ వి.విక్టర్, ఎల్లారెడ్డి ఆర్డీవో ప్రభాకర్, ఫారెస్టు ఆఫీసర్ రామకృష్ణ, తహసీల్దార్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.