పేట్​సంగెం హైస్కూల్ లో టీచర్​గా మారిన కలెక్టర్

పేట్​సంగెం హైస్కూల్ లో టీచర్​గా మారిన  కలెక్టర్

కామారెడ్డి, వెలుగు : గాంధారి మండలం  పేట్​సంగెం హైస్కూల్ ను మంగళవారం కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్ తనిఖీ చేశారు.  పదో తరగతి విద్యార్థులతో  ఫిజికల్ సైన్స్​, ఇంగ్లిష్​ సబ్జెక్ట్​లను బోర్డుపై రాసి, విద్యార్థులను ప్రశ్నలు అడిగారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి మాట్లాడారు. 

ప్రత్యేక క్లాసులను నిర్వహించిన విద్యార్థులను తీర్చిదిద్దాలన్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు.  టెన్త్​ తర్వాత ట్రిపుల్​ ఐటీలో చేరేలా చదువుకోవాలని స్టూడెంట్స్​కు సూచించారు. అనంతరం పేట్​సంగెం రోడ్డుకు ఇరువైపులా ఉన్న మొక్కలకు కలెక్టర్​ నీళ్లు పోశారు.   కలెక్టర్​ వెంట డీఆర్డీవో  సురేందర్​, డీపీవో శ్రీనివాస్​రావు,  స్పెషల్​ఆఫీసర్​ లక్ష్మీప్రసన్న తదితరులు ఉన్నారు.