
కామారెడ్డిటౌన్, వెలుగు : ఎల్ఆర్ఎస్ పక్రియను మరింత స్పీడప్ చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. మంగళవారం కామారెడ్డి మున్సిపాలిటీలో ఎల్ఆర్ఎస్ పక్రియను ఆయన ఆకస్మికంగా పరిశీలించారు. రెగ్యులరైజేషన్ జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. పన్నుల వసూళ్లూ స్పీడప్ న్నాచేయాలని అన్నారు. అప్లయ్ చేసుకున్న వాళ్లకు ఫోన్ చేసి 25 శాతం రిబేట్ ఉపయోగించుకునేలా అవేర్నెస్ తేవాలన్నారు. కమిషనర్ రాజేందర్రెడ్డి, టీపీవో గిరిధర్, డీఈ వేణుగోపాల్ ఉన్నారు.