కామారెడ్డి జిల్లాలో 328 వడ్ల కొనుగోలు సెంటర్లు

కామారెడ్డి జిల్లాలో 328 వడ్ల కొనుగోలు సెంటర్లు
  •     కామారెడ్డి కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​  

కామారెడ్డిటౌన్, వెలుగు: కామారెడ్డి జిల్లాలో  వానాకాలం సీజన్​కు సంబంధించి వడ్ల కొనుగోలుకు 328 సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ ఆశిశ్​సంగ్వాన్ తెలిపారు.  వడ్ల కొనుగోలు సెంటర్లపై ఆయా శాఖల ఆఫీసర్లతో కలెక్టర్​ మీటింగ్​ నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  అక్టోబర్​ రెండో వారంలో సెంటర్లు ప్రారంభిస్తామన్నారు.  జిల్లాలో 5.50 లక్షల మెట్రిక్​ టన్నుల వడ్లు కొనుగోలు చేస్తామన్నారు.  గన్నీ బ్యాగులు, ప్యాడీ క్లీనర్లు,  టార్పాలిన్లు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు.   సెంటర్లలో టెంటు, తాగునీరు,  కరెంటు సౌకర్యం కల్పించాలన్నారు.   అడిషనల్​ కలెక్టర్ శ్రీనివాస్​రెడ్డి,  జిల్లా అగ్రికల్చర్​ ఆఫీసర్​   తిరుమల ప్రసాద్,  డీఎస్​వో మల్లికార్జునబాబు,  డీఎం రాజేందర్, ఏఎస్​వో నరసింహారావు,  డీసీవో రామ్మోహన్,  ట్రాన్స్​ఫార్ట్ ఆఫీసర్​ శ్రీనివాస్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు.