
కామారెడ్డి టౌన్, వెలుగు : రేపు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నేడు జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో సామగ్రిని పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. మంగళవారం కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలోని డిస్ర్టిబ్యూషన్ సెంటర్ను కలెక్టర్ పరిశీలించారు. కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డిలో డిస్ర్టిబ్యూషన్ సెంటర్లలో బుధవారం సామగ్రిని పంపిణీ చేస్తామని, ఎన్నికల సిబ్బందికి అన్ని వసతులు కల్పించాలన్నారు.
గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కోసం 29 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. గ్రాడ్యుయేట్ ఓటర్లు 16,410 మంది, టీచర్ ఓటర్లు 2,011 మంది ఉన్నారని తెలిపారు. కలెక్టర్ వెంట అడిషనల్ కలెక్టర్లు విక్టర్, శ్రీనివాస్రెడ్డి, ఏవో మసూద్ ఆహ్మద్, తహసీల్దార్ జనార్దన్ ఉన్నారు.