కోళ్ల పెంపకందారులు అలర్టుగా ఉండాలి : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

కోళ్ల పెంపకందారులు అలర్టుగా ఉండాలి : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
  • మహారాష్ట్రలోని నుంచి కోళ్లు రాకుండా చూసుకోవాలి

కామారెడ్డిటౌన్, వెలుగు:  మహారాష్ట్రలోని లాతూర్​లో బర్డ్​ ప్లూ ప్రబలినందు వల్ల  కోళ్లపెంపకందారులు అలర్టుగా ఉండాలని కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్ పేర్కొన్నారు.   గురువారం కలెక్టరేట్లో  కోళ్ల పెంపక రైతులు,  పశు సంవర్ధక శాఖ  సిబ్బందికి కోళ్లలో వచ్చే వ్యాధులపై అవగాహన ప్రోగ్రాం నిర్వహించారు. కలెక్టర్​ మాట్లాడుతూ..  మహారాష్ర్ట  మన జిల్లాకు సరిహద్దున ఉన్నందున పెంపకందారులు అలర్టుగా ఉండి ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు.

  మహారాష్ర్ట నుంచి మన జిల్లాలోకి  కోళ్ల రవాణా జరగకుండా సరిహద్దు చెక్​ పోస్టులో తనిఖీలు చేపట్టాలన్నారు.   వ్యాధి సోకకముందే నివారణ చర్యలు చేపట్టాలన్నారు.  వ్యాక్సినేషన్​, ఇమ్యూనిటీ బూస్టర్​ వాడాలని సూచించారు.  పశు సంవర్ధక శాఖ జిల్లా అధికారి  కె.సంజయ్​కుమార్​,  అసిస్టెంట్​ డైరెర్టర్లు   శ్రీనివాస్​, భాస్కరన్​, ఆర్. దేవేందర్​, వెటర్నరీ డాక్టర్లు, తదితరులు పాల్గొన్నారు. 

ప్రాపర్టీ ట్యాక్స్ 100 శాతం వసూలు చేయాలి

కామారెడ్డిటౌన్, వెలుగు:  ప్రాపర్టీ ట్యాక్స్ 100 శాతం వసూలు చేయాలని కలెక్టర్​ఆశిష్​ సంగ్వాన్ పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్ లో  కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి మున్సిపల్​ అధికారులు, సిబ్బందితో  వివిధ ఆంశాలపై రివ్యూ మీటింగ్ జరిగింది. కలెక్టర్​మాట్లాడుతూ..  రోజు వారీ వసూళ్ల వివరాలను ప్రతి రోజు సాయంత్రం తనకు అందించాలన్నారు.  మున్సిపల్​ కమిషనర్లు  క్షేత్ర స్థాయి పర్యటనలు చేయాలన్నారు.  మున్సిపాలిటీల పరిధిలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. వేసవిలో మొక్కలకు నీరు పోయించాలన్నారు.  అడిషనల్ కలెక్టర్​ శ్రీనివాస్​రెడ్డి,  అధికారులు పాల్గొన్నారు.