పరీక్షల్లో టెన్షన్​ పడొద్దు : ఆశిష్​ సంగ్వాన్​

 పరీక్షల్లో టెన్షన్​ పడొద్దు : ఆశిష్​ సంగ్వాన్​
  • రెసిడెన్సియల్​ స్కూల్​ను విజిట్​ చేసిన కలెక్టర్​

కామారెడ్డి, వెలుగు:  పరీక్షల వేళ విద్యార్థులు టెన్షన్​ పడొద్దని  ధైర్యంగా ఎగ్జామ్స్ రాసేందుకు సిద్ధం కావాలని కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​ అన్నారు.  శుక్రవారం రాత్రి రామారెడ్డి మండలం ఉప్పల్​వాయిలోని సోషల్​వెల్ఫేర్​రెసిడెన్సియల్​ స్కూల్, జూనియర్​ కాలేజీని కలెక్టర్​విజిట్​చేశారు.  కిచెన్​ రూమ్​, స్టోర్​రూం​తనిఖీ చేశారు.  విద్యార్థులతో  కలిసి భోజనం చేశారు.  అనంతరం వారితో మాట్లాడుతూ..  కష్టపడి చదివి ఉన్నత స్థాయికి వెళ్లాలన్నారు.  మండల స్పెషల్​ ఆఫీసర్​ సంజయ్​కుమార్​, జోనల్​ ఆఫీసర్​ పూర్ణచందర్​, ప్రిన్సిపాల్​శివరాం, తహసీల్దార్ సువర్ణ, ఎంపీడీవో  తిరుపతిరెడ్డి, ఎంఈవో ఆనంద్​రావు తదితరులు ఉన్నారు. 

ఈవీఎం గోడౌన్​ను పరిశీలించిన కలెక్టర్​

కామారెడ్డిటౌన్, వెలుగు:  కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోడౌన్‌‌‌‌ను శుక్రవారం కలెక్టర్​ఆశిష్​ సంగ్వాన్​ పరిశీలించారు. గోడౌన్​కు వేసిన సీల్స్, గోడౌన్​లో భద్రపరిచిన బ్యాలెట్​యూనిట్లు, వీవీ ప్యాట్లను సీసీ కెమెరాల ద్వారా పరిశీలించారు. అడిషనల్ కలెక్టర్​ వి.విక్టర్,  తహసీల్దార్ జనార్ధన్​, ఎలక్షన్​ సూపరిండెంట్లు అనిల్​, సరళ తదితరులు ఉన్నారు.