కొండారెడ్డిపల్లి గ్రామంలో అభివృద్ధి పనులు స్పీడప్​ చేయాలి : కలెక్టర్ బదావత్ సంతోష్

కొండారెడ్డిపల్లి గ్రామంలో అభివృద్ధి పనులు స్పీడప్​ చేయాలి : కలెక్టర్  బదావత్  సంతోష్

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్  బదావత్  సంతోష్  సూచించారు. కలెక్టరేట్ లో వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై సంబంధిత అధికారులు, తహసీల్దార్, ఇంజనీర్లతో రివ్యూ నిర్వహించారు. 

కలెక్టర్​ మాట్లాడుతూ కొండారెడ్డిపల్లిలో చేపట్టిన పనులను వేగంగా పూర్తి చేయాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని ఆదేశించారు. రోడ్లు, నీటిపారుదల, విద్యుత్, ఆరోగ్యం, అండర్  గ్రౌండ్  డ్రైనేజీ, సోలార్  విద్యుదీకరణ, మిషన్  భగీరథ పనులను కంప్లీట్​ చేయాలని సూచించారు.