స్కూల్​ ప్రిన్సిపాల్​పై కలెక్టర్ ఆగ్రహం

స్కూల్​ ప్రిన్సిపాల్​పై కలెక్టర్ ఆగ్రహం

యాదాద్రి, వెలుగు : బాలికల రెసిడెన్షియల్​స్కూల్ ప్రిన్సిపాల్​పై కలెక్టర్​హనుమంతు జెండగే సీరియస్​ అయ్యారు. సీజనల్ వ్యాధులు పొంచి ఉన్న సమయంలో స్టాఫ్​నర్స్​రాకుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రెసిడెన్షియల్ స్కూల్స్, హాస్టల్స్​లో నెలకొన్న సమస్యలను గుర్తించడానికి రామన్నపేట మండలం జనంపల్లి రెసిడెన్షియన్​స్కూల్​ను శుక్రవారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు.

అటెండెన్స్​రిజిస్టర్ ను పరిశీలించి సిబ్బంది గురించి ఆరా తీశారు. స్కూల్​కు రోజుల తరబడి స్టాఫ్​నర్స్​రావడం లేదని తెలిసింది. దీంతో ప్రిన్సిపాల్​ ఎస్.​రాజాపై కలెక్టర్ సీరియస్​ అయ్యారు. వెంటనే స్టేట్​సోషల్​వెల్ఫేర్​ఆఫీసర్​తో ఫోన్​లో మాట్లాడారు. స్టాఫ్​ నర్స్​ను నియమించాలని సూచించారు. ఈ సందర్భంగా స్టూడెంట్స్​తో కలిసి కలెక్టర్​  మధ్యాహ్న భోజనం చేశారు.

జడ్పీ బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్.. 

జిల్లా పరిషత్​స్పెషల్​ఆఫీసర్​గా కలెక్టర్​హనుమంతు జెండగే బాధ్యతలు స్వీకరించారు. జడ్పీ పాలకవర్గ సభ్యుల పదవీకాలం పూర్తి కావడంతో కలెక్టర్​ను స్పెషల్​ఆఫీసర్​గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. బాధ్యతలను చేపట్టిన ఆయన జడ్పీకి కేటాయించిన ముగ్గురు వీఆర్​ఏలను రికార్డ్​ అసిస్టెంట్స్​గా పదోన్నతి కల్పించారు.