
- కలెక్టర్ ఇలా త్రిపాఠి
- 74 మంది దివ్యాంగుల నుంచి దరఖాస్తుల స్వీకరణ
నల్గొండ అర్బన్, వెలుగు: వయోవృద్ధులు, దివ్యాంగుల ప్రత్యేక ప్రజావాణికి వచ్చిన అర్జీలపై దృష్టి పెట్టాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. శనివారం నల్గొండ కలెక్టరేట్సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమంలో 74 మంది దివ్యాంగుల నుంచి దరఖాస్తులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గతంలో జారీ చేసిన సదరం సర్టిఫికెట్లను ప్రీ అసెస్మెంట్ చేయించాలని, పెన్షన్లు మంజూరు చేయాలని సూచించారు.
ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని కొందరు, ఇల్లు మంజూరు చేయాలని ఇంకొందరు, తమ పిల్లల నుంచి పోషణ భత్యం ఇప్పించాలని పలువురు వృద్ధులు కోరారు. దివ్యాంగులు ప్రతినెలా పెన్షన్తీసుకోవాలని ,3 నెలలకు మించి తీసుకోకపోతే ఆగిపోతుందని కలెక్టర్ తెలిపారు. దరఖాస్తుపై స్పెషల్ గ్రీవెన్స్ అని రాస్తే త్వరగా పరిష్కరించాలని అధికారులకు చెప్పారు. ఆర్డీవోలు తహసీల్దార్లకు ఇలాంటి ఆదేశాలు జారీ చేయాలన్నారు. మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, ఇన్చార్జి డీఆర్వో అశోక్ రెడ్డి, ఆర్డీవోలు రమణారెడ్డి, శ్రీదేవి, జిల్లా సంక్షేమ అధికారిణి కృష్ణవేణి, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్కుమార్ పాల్గొన్నారు.
ఎగ్జామ్ సెంటర్లోకి ఇతరులను అనుమతించొద్దు
హాలియా, వెలుగు: మండల కేంద్రంలోని కృష్ణవేణి ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన టెన్త్ఎగ్జామ్సెంటర్ను శనివారం కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్ర పవార్ తనిఖీ చేశారు. విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలపై ఆరా తీశారు. ఎట్టి పరిస్థితుల్లో సెంటర్లోకి ఇతరులను అనుమతించొద్దని అధికారులను ఆదేశించారు. ఎంఈవో కృష్ణమూర్తి పాల్గొన్నారు.