సీతారామ ప్రాజెక్ట్  పంపు హౌస్ సందర్శించిన కలెక్టర్

సీతారామ ప్రాజెక్ట్  పంపు హౌస్ సందర్శించిన కలెక్టర్

అశ్వాపురం, వెలుగు :  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని భీముని గుండం కొత్తూరు వద్ద సీతారామ ప్రాజెక్ట్ మొదటి దశ పంప్ హౌస్ ను కలెక్టర్ జితేశ్​వి పాటిల్ శుక్రవారం సందర్శించారు. ప్రాజెక్టు నిర్మాణం, ఆయకట్టు తదితర అంశాలను ఇరిగేషన్ అధికారులు కలెక్టర్​కు వివరించారు.

ప్రమాదం పొంచి ఉన్న వద్ద కాల్వకు ఇరువైపులా ఫెన్సింగ్​ ఏర్పాటు చేయాలని కలెక్టర్​ అధికారులకు సూచించారు. ఆయన వెంట నీటిపారుదల శాఖ ఎస్ఈ శ్రీనివాస్ రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, ఈఈ తెల్ల వెంకటేశ్వరరావు, డీఈ శ్రీనివాస్ రావు, ఏఈలు రాజీవ్ గాంధీ, నవీన్, ఎంపీపీ ముత్తినేని సుజాత తదితరులు పాల్గొన్నారు.