మినీ ట్రాక్టర్ల వాడకంపై రైతులకు అవగాహన కల్పించాలి : కలెక్టర్​ జితేశ్​ వి పాటిల్​

మినీ ట్రాక్టర్ల వాడకంపై రైతులకు అవగాహన కల్పించాలి : కలెక్టర్​ జితేశ్​ వి పాటిల్​

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ఆధునిక కాలానికి అనుగుణంగా రైతులు వ్యవసాయానికి ఎద్దుల స్థానంలో మినీ ట్రాక్టర్లు వాడుకునేలా అవగాహన కల్పించాలని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్​ జితేశ్ ​వి పాటిల్​ అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్​లో బ్యాంకర్లు, పలు శాఖల ఆఫీసర్లతో నిర్వహించిన మీటింగ్​లో ఆయన మాట్లాడారు. రైతులకు మినీ ట్రాక్టర్స్​ కొనేందుకు రుణాలు మంజూరు చేయాలని బ్యాంకర్లకు సూచించారు. చండ్రుగొండ మండలం బెండాలపాడు గ్రామంలో గిరిజన రైతులు బ్యాంకు లోన్​ ద్వారా రూ. 3కోట్లతో కోల్డ్​ స్టోరేజ్​ ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు.

 బ్యాంకు లోన్లతో జిల్లాలో మరిన్ని కోల్డ్​ స్టోరేజ్​ల నిర్మాణానికి ముందుకు రావాలన్నారు. వ్యవసాయ రంగంలో ఆధునిక పరికరాల కోసం బ్యాంకర్లు లోన్లు ఇవ్వాలని కోరారు. మారుమూల గ్రామాల్లో బీఎస్​ఎన్​ఎల్, జియో, ఎయిర్​టెల్​ లాంటి నెట్​ వర్క్స్​ల సేవలు అందుబాటులో లేవని, ఆయా సంస్థల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేయాలని ఆఫీసర్లకు సూచించారు. మత్స్య కారులకు లోన్లు మంజూరు చేయాలన్నారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అడిషనల్​కలెక్టర్​ విద్యాచందన, డీఏవో బాబూరావు, ఎల్డీఎం రాంరెడ్డి పాల్గొన్నారు