పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి :కలెక్టర్ జితేశ్​ వి పాటిల్​ 

పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి :కలెక్టర్ జితేశ్​ వి పాటిల్​ 
  •  భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్​ వి పాటిల్​ 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లాను పరిశుభ్ర జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్​ జితేశ్​వి పాటిల్​ పిలుపునిచ్చారు. లక్ష్మీదేవిపల్లి మండలంలోని శ్రీరామచంద్ర డిగ్రీ కాలేజీలో శనివారం నిర్వహించిన శ్రమదానంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాలేజీలోని గ్రౌండ్​లో క్రీడాకారులకు అవసరమైన సౌకర్యాలు కల్పించనున్నట్టు తెలిపారు. వాలీబాల్, హాకీ కోర్టులు, స్విమ్మింగ్​పూల్​ ఏర్పాటు చేస్తామని చెప్పారు. పర్యావరణ పరిరక్షణకు అందరం కృషి చేయాలన్నారు. ఈ ప్రోగ్రాంలో అడిషనల్​ కలెక్టర్​ విద్యాచందన, జిల్లా యువజన క్రీడల శాఖాధికారి పరంధామరెడ్డి, డీపీవో చంద్రమౌళి, కాలేజ్​ ప్రిన్సిపాల్​ డాక్టర్​ వనజ, ఇంటర్మీడియట్​ ఎడ్యుకేషన్ ​జిల్లా అధికారి వెంకటేశ్వర్లు, ఎంపీడీవో చలపతి  పాల్గొన్నారు.