
- భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. రోడ్డు భద్రతపై బుధవారం కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ సమావేశంలో ఆయన మాట్లాడారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి, నివారణ చర్యలు చేపట్టాలన్నారు. యాక్సిడెంట్స్ జరిగినప్పుడు తక్షణ చికిత్స అందించేందుకు వైద్య, ఆరోగ్య శాఖ తరఫున ప్రణాళికలను రూపొందించాలని డీఎంహెచ్ఓను ఆదేశించారు.
రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలకు దగ్గరగా ఉన్న హాస్పటల్స్ను గుర్తించాలన్నారు. మున్సిపాలిటీల్లోని ప్రధాన కూడళ్లలో పార్కింగ్ స్థలాలను గుర్తించాలని ఆదేశించారు. ఈ మీటింగ్లో జిల్లా రవాణాశాఖాధికారి వెంకటరమణ, ఆర్అండ్బీ ఈఈ వెంకటేశ్వరరావు, పంచాయతీ రాజ్ ఈఈ శ్రీనివాసరావు, డీసీహెచ్ఓ డాక్టర్ రవిబాబుతో పాటు పలు శాఖల ఆఫీసర్లు పాల్గొన్నారు.