
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లా ఆఫీసర్ల తీరుపై కలెక్టర్ జితేశ్ వి పాటిల్తో పాటు అడిషనల్ కలెక్టర్ వేణుగోపాల్ అసహనం వ్యక్తం చేశారు. కలెక్టరేట్లో సోమవారం అడిషనల్ కలెక్టర్లతో కలిసి కలెక్టర్ గ్రీవెన్స్ నిర్వహించారు. ప్రజల వద్ద నుంచి అర్జీలు తీసుకున్నారు. అధికారులు గ్రీవెన్స్కు కూడా ఇన్టైంలో రాకపోతే ఎట్లా అంటూ అడిషనల్ కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పీఎం ఇంటర్న్షిప్కు దరఖాస్తు చేసుకోవాలి
పీఎం ఇంటర్న్ షిప్ పథకానికి అర్హులైన స్టూడెంట్స్ దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇంటర్న్షిప్కు సెలెక్ట్ అయిన స్టూడెంట్స్కు నెలకు రూ. 5వేల నుంచి రూ.6వేలు ఏడాది పాటు సాంక్షన్ అవుతుందన్నారు. కుటుంబ ఆదాయం రూ. 8లక్షల లోపు ఉండాలని తెలిపారు. ఆసక్తి గల వారు మార్చి 11వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1800116090 కు ఫోన్ చేయాలని సూచించారు.