కొత్తగూడెం హాస్టళ్లలో కూలర్లు ఏర్పాటు చేయాలి : కలెక్టర్​ జితేశ్​ వి పాటిల్​

కొత్తగూడెం హాస్టళ్లలో కూలర్లు ఏర్పాటు చేయాలి : కలెక్టర్​ జితేశ్​ వి పాటిల్​

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : వేసవిలో స్టూడెంట్స్​కు ఇబ్బంది లేకుండా హాస్టళ్లలో కూలర్లు ఏర్పాటు చేయాలని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్​ జితేశ్​ వి పాటిల్​ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కొత్తగూడెంలోని నర్సింగ్​ కాలేజీ హాస్టల్​ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతున్నందున శనివారం లోపు హాస్టల్​లో కూలర్లు ఏర్పాటు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. థర్మోకోల్​తో సీలింగ్​ చేయాలన్నారు. తాగు నీటి కోసం ఫ్రిజ్ ఏర్పాటు చేయాలని చెప్పారు.  హాస్టల్​ చుట్టూ ప్రహరీ నిర్మించాలన్నారు. హాస్టల్​లో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కలెక్టర్​వెంట వార్డెన్​, సిబ్బంది ఉన్నారు.  

మత సామరస్యాలకు ప్రతీక ఇఫ్తార్​ విందు

మత సామరస్యాలకు ప్రతీకగా రంజాన్​ మాసంలోని ఇఫ్తార్​ విందు అని కలెక్టర్​ జితేశ్​ తెలిపారు. మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్​లో శుక్రవారం ఏర్పాటు చేసిన ఇఫ్తార్​ విందుకు ఆయన హాజరయ్యారు. ఈ ప్రోగ్రాంలో అడిషనల్​కలెక్టర్​ డి. వేణుగోపాల్, సీపీఓ సంజీవరావు, ఏపీ ఆర్వో అజ్గర్​ హుస్సేన్ పాల్గొన్నారు.