అంగన్​వాడీల్లో అన్ని సౌకర్యాలు ఉండాలి : కలెక్టర్ ​జితేశ్​వి పాటిల్

అంగన్​వాడీల్లో అన్ని సౌకర్యాలు ఉండాలి : కలెక్టర్ ​జితేశ్​వి పాటిల్
  • భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ ​జితేశ్​వి పాటిల్ 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ప్రతి అంగన్​వాడీ సెంటర్లో కరెంట్, డ్రింకింగ్​వాటర్, టాయ్​ లెట్స్​ సౌకర్యం కల్పించాలని కలెక్టర్​ జితేశ్​వి పాటిల్​ ఆఫీసర్లను ఆదేశించారు. కలెక్టరేట్ లో ఐసీడీఎస్, చైల్డ్​ ప్రొటెక్షన్, చైల్డ్​ హెల్ప్​ లైన్, ఆడాప్షన్​ పై బుధవారం రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అన్ని అంగన్​వాడీ కేంద్రాల్లో కరివేపాకు, ఉసిరి, మునగ, చింత, వెలగ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు.

అద్దె భవనాల్లో కొనసాగుతున్న అంగన్​వాడీ కేంద్రాల వివరాలను ఇవ్వాలని ఆదేశించారు. అంగన్​వాడీ కేంద్రాల పరిధిలో గర్బిణులు, బాలింతలు, పిల్లలకు సంబంధించి నిర్దేశించిన ఫార్మట్​ ద్వారా ఖచ్చితమైన వివరాలను అందజేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా సంక్షేమశాఖ అధికారి స్వర్ణలత లెనీనా, సీడీపీవోలు, సీడబ్ల్యూఎస్, డీసీపీ మెంబర్లు పాల్గొన్నారు.  

19న దిశ కమిటీ మీటింగ్​ 

ఈ నెల 19న దిశ కమిటీ జరుగనుందని కలెక్టర్​ జితేశ్ వి పాటిల్​ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్​లో మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం ప్రారంభం కానుందని పేర్కొన్నారు. మహబూబాబాద్​ ఎంపీ పోరిక బలరాం నాయక్​ అధ్యక్షతన దిశ కమిటీ కొనసాగనుందని తెలిపారు. కో చైర్మన్​గా ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి వ్యవహరిస్తారని పేర్కొన్నారు.