కొత్తగూడెంలో బాల రక్షా భవన్ ప్రారంభం​

 కొత్తగూడెంలో బాల రక్షా భవన్ ప్రారంభం​
  • సమ్మర్​లో నీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టాలి
  • కలెక్టర్​ జితేష్ వి పాటిల్​​

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: బాలల రక్షణ కోసమే బాల రక్షా భవన్​ ఏర్పాటు చేశామని కలెక్టర్​ జితేష్​ వి పాటిల్​ పేర్కొన్నారు. కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన బాల రక్షా భవన్​ను ఆయన మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆఫీస్​కు అవసరమైన కంప్యూటర్లు, ఇతర సామగ్రి ఏర్పాటుకు నివేదికలు అందజేయాలన్నారు.

జిల్లా బాలల పరిరక్షణ విభాగం, బాలల సంక్షేమ సమితి, బాలల న్యాయ మండలి, ప్రత్యేక బాలల పోలీస్​విభాగం, జాతీయ బాల కార్మిక నిర్మూలన పథకం, జిల్లా ప్రొబేషన్​ఆఫీసర్, చైల్డ్​ లైన్​అన్నీ కలిపి ఒకే చోట అందుబాటులో ఉంటాయన్నారు. ఈ ప్రోగ్రాంలో పలు శాఖల ఆఫీసర్లు పాల్గొన్నారు. 

సమ్మర్​లో నీటి ఎద్దడి లేకుండా చూడాలి..

సమ్మర్​లో నీటి ఎద్దడి లేకుండా చూడాలని ఆఫీసర్లను కలెక్టర్​ఆదేశించారు. నీటి ఎద్దడి లేకుండా ప్రణాళికలను రూపొందించాలన్నారు. తాగు నీటి సమస్యపై క్షేత్ర స్థాయిలో ఆఫీసర్లు పర్యటించి, సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. పైప్​ లైన్​రిపేర్లు చేపట్టాలన్నారు. గ్రామాల్లో తాగు నీటి ఎద్దడిపై టోల్​ఫ్రీ నెంబర్ 180059 94007 ద్వారా సమాచారం ఇస్తే పరిష్కరిస్తారని తెలిపారు.