
పాల్వంచ, వెలుగు: నవభారత్ తెలంగాణ సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో నిర్వహించిన టీజీ సెట్ పరీక్ష కేంద్రాన్ని ఆదివారం కలెక్టర్ జితేశ్ వి పాటిల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. తెలంగాణ గురుకుల విద్యాలయాల్లో 5వ తరగతి ప్రవేశాలతోపాటు 6,7, 8, 9 తరగతులకు సంబంధించి బ్యాక్ లాగ్ ఖాళీల భర్తీకి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. పరీక్షా కేంద్రానికి 460 మంది విద్యార్థులకు 444 మంది విద్యార్థులు హాజరయ్యారని అధికారులు తెలిపారు.