ఎమ్మెల్సీ ఎన్నికల విధులు పక్కాగా నిర్వహించాలి : కలెక్టర్​ జితేశ్​ 

ఎమ్మెల్సీ ఎన్నికల విధులు పక్కాగా నిర్వహించాలి : కలెక్టర్​ జితేశ్​ 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ఈ నెల 27న ఎమ్మెల్సీ ఎన్నికలు పక్కాగా నిర్వహించాలని కలెక్టర్ ​జితేశ్​వి పాటిల్​సిబ్బందికి సూచించారు. ఎన్నికల్లో విధులు నిర్వహించే పీవో, ఏపీవోలకు శనివారం కలెక్టరేట్​లో  నిర్వహించిన శిక్షణా తరగతుల్లో ఆయన మాట్లాడారు.

ఎన్నికల ముందు రోజే సిబ్బంది పోలింగ్​ కేంద్రాలకు చేరుకోవాలన్నారు. ఓటర్ల జాబితా, పోలింగ్​ సామగ్రి, బ్యాలెట్​ పేపర్లు అన్ని సరి చేసుకోవాలని చెప్పారు. లక్ష్మీదేవిపల్లి మండలంలోని గవర్నమెంట్​ డిగ్రీ కాలేజీలో డిస్ట్రిబ్యూషన్​ సెంటర్​ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. 

అర్ధరాత్రి వరకు షాప్​లు ఓపెన్... 

రంజాన్​ పండుగ సందర్భంగా అర్ధరాత్రి 12 గంటల వరకు షాప్స్​ఓపెన్​ చేసుకోవచ్చని కలెక్టర్​ తెలిపారు. కలెక్టరేట్​లో పలు విభాగాల ఆఫీసర్లు, ముస్లీం మత పెద్దలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వచ్చే నెల 2 నుంచి రంజాన్​ మాసం సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు.

ప్రార్థనా సమయానికి అనుగుణంగా రెండు పూటలా తాగునీటిని సప్లై చేసేలా మిషన్​ భగీరథ ఆఫీసర్లు చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లాలోని అన్ని మసీదులు, వాటి మత పెద్దల వివరాలను తెలుపాలని చెప్పారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈవో నాగలక్ష్మి, భద్రాచలం ఆర్డీవో దామోదర్​ రావు, డీపీవో చంద్రమౌళి, డీఎంహెచ్​వో భాస్కర్​ నాయక్, మున్సిపల్​కమిషనర్లు పాల్గొన్నారు.