కొత్తగూడెంలోని ఐటీఐకి కంప్యూటర్లు​ ఇస్తాం : కలెక్టర్ ​జితేశ్​ వి పాటిల్​  

కొత్తగూడెంలోని ఐటీఐకి కంప్యూటర్లు​ ఇస్తాం : కలెక్టర్ ​జితేశ్​ వి పాటిల్​  

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కొత్తగూడెంలోని గవర్నమెంట్​ ఐటీఐకి అవసరమైన కంప్యూటర్స్​ను అందజేస్తామని కలెక్టర్​జితేశ్​ వి పాటిల్​ తెలిపారు.  ఐటీఐని కలెక్టర్​ గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఐటీఐకి కావాల్సిన వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. స్టూడెంట్స్​తో మాట్లాడారు. స్టూడెంట్స్​కు అవసరమైన బుక్స్​ కొరత లేకుండా చూడాలన్నారు. ప్రాక్టికల్స్​కు అవసరమైన మెటీరియల్స్, ఫర్నీచర్స్​ను దశల వారీగా అందజేస్తామన్నారు. కాంపౌండ్​ వాల్​ పెంచడంతో పాటు ఇనుపకంచె వేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, ఇందుకు ప్రతిపాదనలు పంపాలని సూచించారు.

ల్యాబ్స్, క్లాస్​ రూమ్స్​తో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఖాళీగా ఉన్న టెక్నికల్​ స్టాఫ్, ఆఫీస్​ సబార్డినేట్స్​ పోస్టులను భర్తీ చేస్తామని చెప్పారు. ఐటీఐ టాటా టెక్నాలజీ సంస్థతో టై అప్​ అయి అడ్వాన్స్​ టెక్నాలజీ సెంటర్​కు సెలక్ట్​ అయిందన్నారు. ఇందుకు సంబంధించి బిల్డింగ్​ కట్టేందుకు అవసరమైన ల్యాండ్​ను పరిశీలించారు. ఈ ప్రోగ్రాంలో ఐటీఐ ప్రిన్సిపాల్​ జి. రమేశ్​​ పాల్గొన్నారు.